ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దుర్గాప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వాసిరెడ్డి దుర్గాప్రసాద్ ఇక లేరు. 84 సంవత్సరాల దుర్గా ప్రసాద్ వయసు పైబడటంతో అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కన్నుమూసారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన సినిమాటోగ్రాఫర్లలో ఆయన ఒకరు.

అమితాబ్ బచ్చన్, మనోజ్ కుమార్ హీరోగా వెలిగిన రోజుల్లో ఆయన బాలీవుడ్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పేరుగాంచారు. దాదాపు 99 బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలకు ఆయన తన సేవలు అందించారు. తెలుగులో దుర్గాప్రసాద్ పనిచేసిన చివరి చిత్రం స్వరాభిషేకం.


Click it and Unblock the Notifications