Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘డమరుకం’ విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ
హైదరాబాద్: నాగార్జున 'డమరుకం' విడుదల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇదిగో విడుదల అదిగో రిలీజ్ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు గత సంక్రాంతి నుంచి ఊరిస్తూ వస్తున్నారు. దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్నా సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అక్టోబర్లో ఈచిత్రం విడుదలకు అన్నీ ఏర్పాట్లు చేసినా ఎందుకనో నిర్మాతలు చివరి నిమిషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మరోసారి మూవీ రిలీజ్ పోస్ట్ పోన్డ్ చేసారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వీకెండ్ లోగా సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎక్కువ థియేటర్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని, తాము అనుకున్నన్ని థియేటర్లు దొరకక పోవడంతో విడుదలపై ఏనిర్ణయానికి రాలేక పోతున్నారని సమాచారం. నవంబర్ 9న గానీ, అప్పటికీ పరిస్థితులు అనుకూలించక పోతే నవంబర్ 15లోపు ఏదో ఒక తేదీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక సినిమా విశేషాల్లోకి వెళితే....... దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి అందరు టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. సినిమాలో లాస్ట్ 35 నిమిషాలు గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల రేంజిలో ఉంటాయి. కేలం గ్రాఫిక్స్ వల్లనే సినిమా ఆడుతుందని నేను అనను. కథకు తగిన విధంగా గ్రాఫిక్స్ చాలా భాగా సూటయ్యాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు నాగార్జున.
నాగార్జున, అనుష్క నటిస్తున్న డమరుకం చిత్రంలో ప్రకాష్ రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.