Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
సినిమా చూడండి...నేను హామీ ముఖ్యమంత్రి ప్రకటన
ఓ ముఖ్యమంత్రి స్వయంగా ఓ చిత్ర ప్రదర్శన విషయంలో కలగచేసుకుని హామీ ఇవ్వటం ఇదే మొదటసారి అంటున్నారు. తాజాగా ఈ సంఘనటన షారుక్ఖాన్ చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్' కు సంభవించింది. ఈ చిత్ర ప్రదర్శనను ఎవ్వరూ అడ్డుకోకుండా భద్రతకల్పిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్చవాన్ ప్రకటన చేసారు. శివసేన హెచ్చరికల్ని లెక్క చేయకుండా నిశ్చితంగా వెళ్లి చిత్రాన్ని తిలకించాలని ప్రజల్ని కోరారు. తాను కూడా సినిమా చూస్తానన్నారు. అలాగే షారుక్ ఖాన్, శివసేన తమ వివాదాల్ని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని శివసేన ప్రకటించింది. శివసైనికులకు భయపడి ముంబయి, పుణెల్లో ముందస్తు టిక్కెట్ల విక్రయాల్ని మల్టీప్లెక్స్లు నిలిపివేశాయి. మరో ప్రక్క చిత్రం విడుదలకు సమస్యలు తలెత్తకుండా ముంబయి పోలీసులు వెయ్యి మందికి పైగా శివసైనికుల్ని అదుపులోకి తీసుకున్నారు.