Don't Miss!
- Finance Google Layoffs: ఉద్యోగులను మళ్లీ తగ్గించిన గూగుల్.. భారతీయ టెక్కీలపై భారీ ప్రభావం..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
సినిమాల్లో ఫైటింగ్ సీన్లతో ఇబ్బంది: సీఎం రోశయ్య
ప్రతి ఐదు నిమిషాలకు చెవులు చిల్లులుపడేలా ఫైటింగ్ సీన్లు అదరగొడుతున్నాయి.పాత సినిమాల్లో ఇన్ని ఫైట్స్ ఉండేవి కాదు. ప్రస్తుత సినిమాల్లో సందేశాత్మక సన్నివేశాలకు బదులు, హింసను ప్రోత్సహించే సన్నివేశాలనే ఎక్కుగా చూపిస్తున్నారు అంటూ సీఎం రోశయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ స్థాపించి 50 ఏళ్లయిన సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవంలో ఆయన ప్రసంగించారు. అలాగే..వర్ధమాన నటీనటులను చూస్తుంటే తనకు జాలి వేస్తుందన్నారు. ఎవరూ హీరోనో..ఎవరు హీరోయినో కూడా అర్థం కావడం లేదన్నారు.
అలాగే పాతచిత్రాల్లో మంచి సందేశాలే కాకుండా పాటల్లో మంచి సాహిత్యం కూడా ఉండేదని, నాటి యువతరానికివి మార్గదర్శకంగా ఉండేవని ఆయన చెప్పారు. మంచి ఆలోచనలు, పరిజ్ఞానం పదిమందికి ఉపయోగపడేలా సమాజంలో ప్రేరణ కలగాలంటే కవుల రచనలు, సినిమాల ద్వారానే సాధ్యమని, నేతల ఉపన్యాసాల వల్ల కాదని రోశయ్య పేర్కొన్నారు. సి.నారాయణరెడ్డి అధ్యతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రోశయ్య ముఖ్య అతిథిగా, కేంద్రమానవవరుల అభివృద్ధి శాఖ మంత్రి డి.పురందేశ్వరి అతిథిగా పాల్గొని, అన్నపూర్ణ చిత్ర దర్శకుడు వి.మధుసూదనరావు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, ప్రజానటి జమున రమణారావు, నటి వాణిశ్రీలకు జగపతి అపూర్వ సత్కారాలను అందజేశారు.