Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐశ్వర్యారాయ్ కు సైతం తప్పని అత్తపోరు...
బచ్చన్ కోడలు ఐశ్వర్య వేరు కాపురం పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అత్త జయాబచ్చన్ వైఖరితో ఐశ్వర్య ఇమడలేకపోతోందట. ఐశ్వర్యారాయ్కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జయాబచ్చన్ జోక్యం చేసుకోవడాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంవల్లే అత్తాకోడళ్ల మధ్య మనస్ఫర్ధలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛతో సంబంధం లేకుండా చేసే ప్రతిపని, తీసుకునే ప్రతి నిర్ణయం గురించి అత్త జయాబచ్చన్కు ఐశ్వర్య చెప్పాల్సిందేనట. అత్తతో రోజూ ఎదుర్కొంటున్న సమస్యతో విసుగెత్తిపోయి, ఓపిక నశించిపోవడంతో స్వతంత్రంగా ఉండాలని ఐశ్వర్య ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులు ఐశ్వర్యను ఆమె పేరుతో (అత్తింటి పేరు లేకుండా) పిలవడంతో చూసిన జయబచ్చన్ కోపంతో ఊగిపోయిందంటున్నారు. అంతేగాక ఆ ఫొటో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఐశ్వర్యా... ఐశ్వర్యా అంటూ పిలవడం ఏమిటి... ఆమె ఏమైనా మీ స్నేహితురాలా, క్లాస్మేటా?'' అని ప్రశ్నించింది. ఇదంతా మీడియా ఎదుటే చోటుచేసుకోవడంతో అత్త జయాబచ్చన్ వ్యవహారశైలి కోడలు ఐశ్వర్యరాయ్ను నొప్పించింది. ఈ సంఘటన తర్వాత అత్తపై అసంతృప్తి వ్యక్తంచేయకపోయినా ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
అయితే భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్లపై ఐశ్వర్యకు ప్రేమాభిమానాలు ఏమీ తగ్గలేదు. అభిషేక్ ఆమెకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిస్తారట. దానికితోడు మామ అమితాబ్ ఆమె వ్యక్తిగత విషయాల్లో అసలు జోక్యం చేసుకోరని అంటున్నారు. ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ త్వరలోనే బాలీవుడ్లోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఐశ్వర్య అభీష్టానికి అత్తగా జయాబచ్చన్ అడ్డుచెబితే ఇరువురి మధ్యా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా జరగడానికి ముందే భర్త, కుమార్తెతో కలిసి అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెట్టాలని ఐశ్వర్యారాయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూద్దాం.