కలర్స్ స్వాతి, రామ్ చరణ్ హీరోయిన్ కలిసి...
కలర్స్ స్వాతి, ఆరెంజ్ సినిమా హీరోయిన్ షాజన్ పదాంసీ నటించిన తమిళ చిత్రం 'కనిమొళి'. జర్నీ ఫేం జై ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెలుగులో అనువదం కాబోతోంది. జె.ఎన్.ఆర్. పవర్ఫుల్ మూవీస్ పతాకంపై జిక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రం తెలుగు హక్కులను దక్కించుకున్నారు.
ఈ సినిమా గురించి నాగేశ్వరరావు మాట్లాడుతూ 'తమిళంలో ఘనవిజయం సాధించిన 'కనిమొళి' చిత్ర అనువాద హక్కుల కోసం గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ ఈ చిత్ర అనువాదహక్కులు పొందగలిగాం. త్వరలో కథకు అనుగుణంగా ఓ చక్కటి టైటిల్ని ఖరారు చేస్తామని తెలిపారు.
జనవరి ద్వితీయార్థంలో ఆడియోను, అదే నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సతీష్ చక్రవర్తి, నిర్మాణ సారథ్యం: జిక్కుల సుజాత, సమర్పణ: మాస్టర్ ఉదయ్ తేజ.


Click it and Unblock the Notifications











