Don't Miss!
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'చాక్లెట్ ఇస్తా అంటూ దేవిశ్రీ ప్రసాద్ నాచేత...': కలర్స్ స్వాతి
రీసెంట్ గా విడుదలైన '100% లవ్' సినిమాలోని 'ఏ స్క్వేర్...' పాటని కలర్స్ స్వాతి పాడింది. మార్కెట్లో ఈ పాట మంచి పేరు తెచ్చుకుంది.హీరోయిన్ గా అవకాశాలు కోసం ట్రై చేస్తున్న స్వాతి హఠాత్తుగా ఇలా గాయినిగా అవతారం ఎత్తటానకి కారణమేమిటా అంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్తోంది.ఈ విషయమై మాట్లాడుతూ..ఈ సినిమాలో దేవి నాచేత బతిమాలి పాడించుకొన్నారు. 'ఒక్క లైన్ పాడు ప్లీజ్... చాక్లెట్ ఇస్తా' అని చెప్పేవారు. దాంతో సులువుగా పాడేశా'' అని చెబుతోంది స్వాతి.ఇక ఈ మ్యాటర్ పై దేవి ఏమంటున్నాడంటే...''నాకు స్వాతి ఎప్పటి నుంచో తెలుసు. అయితే తను పాటలు కూడా పాడుతుందని ఎప్పుడూ అనుకోలేదు.'100%లవ్' సినిమాలోని 'ఏ స్క్వేర్...' పాటని స్వాతితో పాడిస్తే బాగుంటుంది అనిపించింది. చాలా బాగా పాడింది. తనచేత మరిన్ని పాటలు పాడిస్తా'' అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు.ఇంతకీ మీరు ఆ పాట విన్నారా...ఎలా ఉంది.