Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ బాటలో కుర్ర హీరోయిన్ స్వాతి!
హైదరాబాద్: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా పవన్ కళ్యాణ్ బాట పట్టింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మెడీ గాలి వీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగార్జున, మంచు లక్ష్మి, శివాజీ, సమంత లాంటి వారు మోడీకి తన మద్దతు ప్రకటించారు.
ఇప్పుడు ఆ లిస్టులో కలర్స్ స్వాతి కూడా చేరడం చర్చనీయాంశం అయింది. మోడీ గురించి ఆమె మాట్లాడుతూ....మోడీ లాంటి వ్యక్తులు ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని అంటోంది. యువత కూడా అదే కోరుకుంటున్నారని స్వాతి అభిప్రాయ పడుతోంది. అదే సమయంలో రాహుల్ గురించి అడిగినపుడు ఆమె పక్కున నవ్వేసి....ఆయన మెడీ కంటే చాలా వెనక ఉన్నాడని వ్యాఖ్యానించింది.
స్వాతి గురించిన వివరాల్లోకి వెళితే...యాంకర్గా కెరీర్ మొదలు పెట్టిన స్వాతి తన టాలెంటుతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో 'బంగారు కోడిపెట్ట', 'కార్తికేయ' చిత్రాల్లో నటిస్తోంది. బంగారు కోడి పెట్ట చిత్రంలో నవదీప్ హీరోగా నటిస్తుండగా, కార్తికేయ చిత్రంలో నిఖిల్ సిద్దార్త్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో 'అమలి తుమలి', 'వడా కర్రీ', మళయాలంలో ఓ చిత్రంలో నటిస్తోంది.