Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కమెడియన్ పృథ్వీ ప్రధాన పాత్రలో మై డియర్ మార్తాండం (ఫస్ట్ లుక్)
థర్టీ ఇయర్స్ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో డైలాగుతో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ పృథ్వి ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్లో టాప్ కమెడియన్గా ఎదిగారు. ఆయన ప్రధాన పాత్రలో మై డియర్ మార్తాండం అనే సినిమా రాబోతోంది. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కె.వి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ... నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ - కమెడియన్గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీగారు టైటిల్ పాత్రలో నటిస్తున్నారని తెలిపారు.
"ముప్పై రోజుల్లో లాయర్ అవడం ఎలా"? అనే పుస్తకాన్ని చదివిన డిఫెన్స్ లాయర్ పాత్రలో పృథ్వీగారి నటన సినిమాకే హైలైట్ కానుంది. క్రైమ్ కామెడీగా కోర్టు రూమ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పస్ట్లుక్ విడుదల చేశాం. త్వరలోనే టీజర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్, కల్పిక గణేశ్, కల్యాణ్ విట్టపు, తాగుబోతు రమేశ్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రవీణ్, మ్యూజిక్: పవన్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, సినిమాటోగ్రఫీ:ర్యాండీ, నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్, రచన, దర్శకత్వం: హరీష్ కె.వి