Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగా హీరో షూటింగ్ లో ప్రమాదం: 'ధర్టీ ఇయిర్స్' ఫృధ్వీ కు గాయాలు,హాస్పటిల్ లో
హైదరాబాద్ : ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ గా పాపులర్ అయిన కమిడియన్ ఫృధ్వీ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారు. ఆయన్ని వెంటనే హాస్పటిల్ చేర్చించి చికిత్స చేస్తున్నారు. స్టంట్స్ జరిగినప్పడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఈ విషయాన్ని ఫృధ్వి తన ఫేస్ బుక్ లో షేర్ చేసి అభిమానులకు తెలియచేసారు.
ఇంతకీ ఈ ప్రమాదం ఈ షూటింగ్ లో జరిగింది అంటే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో జరిగింది. రోప్ స్టంట్ ఫైటింగ్ సీన్ ని షూట్ చేస్తూండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఫృద్వి చిన్న పాటి గాయాలతో బయిటపడ్డారు.
వెంటనే చిత్రం యూనిట్ ఎలర్టై ఆయన్ను దగ్గరలోని హాస్పటిలో చేర్చించి ట్రీట్ మెంట్ ఇప్పించారు. ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్దించిన ఫ్యాన్స్ కు ఆయన ధాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలియచేసారు.
ఇంతకు ముందు సాయిదరమ్ తేజ చిత్రం సుప్రీమ్ సమయం లోనూ ఇలాగే యాక్సిడెంట్ చోటు చేసుకున్న సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. అప్పుడు అందులో విలన్ గా చేస్తున్న రవి, షేకింగ్ షేషులకు దెబ్బలు తగిలాయి. షూటింగ్ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవని సిని వర్గాలు చెప్తున్నాయి.