Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
దూల తీర్చుకోవడం ఇష్టం లేదు, కసిమీద ఉన్నాం, జెండా ఊపుతా: కమెడియన్ పృథ్వి
Recommended Video
తెలుగులో టాప్ కమెడియన్గా తన సత్తాచాటుతున్న పృథ్వి వచ్చే ఏపీ ఎన్నికల్లో తన మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేయడం ఖాయం అని, తమ పార్టీనే అధికారంలోకి వచ్చితీరుతుందని వ్యాఖ్యానించారు.
మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అనే ప్రశ్నకు పృథ్వి అలాంటిదేమీ లేదని తెలిపారు. రాజకీయం అంటే దూల... దూల తీర్చుకోవడానికి వెళ్లడం లేదు, ప్రజలకు సేవ చేయడానికే వెళుతున్నాను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
సేవ చేయడానికి రాజకీయాలు అవసరం లేదు
ప్రజలకు సేవ చేయాలంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి... మీరు ఏ సీటు ఆశిస్తున్నారు? అని ఓ ఛానల్ వారు ప్రశ్నించగా సామాజిక సేవ చేయాలంటే పవర్తో సంబంధం లేదు. మంచి పని చేస్తే రాజకీయనాయకుల అండదండలు తప్పకుండా ఉంటాయి. నాలాంటి వారు పోటీ చేయకపోయినా ఫర్వాలేదు. జగన్ లాంటి వారు గెలిస్తే మంచి జరుగుతుందన్నారు.
పాయల్ రాజ్పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!
ఆయన ముందు జెండా ఊపుతా
పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నపుడు ఓ ముసలాయన జెండా పట్టుకుని మోటివేట్ చేసేవాడు. షార్జా కప్లో జావేద్ మియాందాద్ 3 రన్స్ కొట్టకుండా ఆపితే ఇండియా విజయం సాధిస్తుంది. కానీ ఆ ముసలాయన జెండా ఊపగానే మియాందాద్ సిక్స్ కొట్టాడు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చైర్లో కూర్చుంటే ఆయన ఏ పర్యటనకు వెళితే ఆ పర్యటన ముందు జెండా ఊపుతూ ఉండాలి. అదే నా కోరిక... అని పృథ్వి తెలిపారు.
మేమంతా కసిమీద ఉన్నాం
ఏ పార్టీవారు ఎలా పోయినా మాకు అనవసరం. 2019లో రూల్ చేసేది వైసీపీ. మేమంతా కసిమీద ఉన్నాం. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పథకాలు ఎలా ఉండాలి, సంక్షేమం ఎలా ఉండాలో చేసి చూపిస్తామని పృథ్వి తెలిపారు.
పృథ్వి వరుస ఇంటర్వ్యూలు
ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పృథ్వి మీడియాలో తన వాయిస్ పెంచారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై విమర్శలు చేస్తూ తనదైనశైలిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.