Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నేను, పోసాని, కేఏ పాల్ వస్తే... బిగ్బాస్ షోలో వాళ్లని కడిగిపారేస్తాం: కమెడియన్ పృధ్వీ
బిగ్బాస్ షో మీద కమెడియన్ పృధ్వి సంచలన కామెంట్స్ చేశారు. ఆ షో వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...ఈ షో ద్వారా జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ షోలో సరైన వారు ఎవరూ లేరని.... ఈ షోలోకి పోసాని కృష్ణమురళి, కేఏపాల్, నా లాంటి వారు వెళితే అసలు మజా వస్తుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే బిగ్బాస్ చెప్పినట్లు ఉండటం మా వల్ల కాదని, మాకు నచ్చినట్లు ఉంటామని తెలిపారు.
పృధ్వీ దృష్టిలో బిగ్బాస్ షో ఎలా ఉందంటే..
బిగ్బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం? అందరినీ ఒక గదిలో పెట్టారు. ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద ఊర్లో ఒక పెళ్లి...పెళ్లికి అందరూ రావడం, అందరూ పడుకుని ఉండటం, వీడి మ్యారేజ్ అయిపోయినా వీడికి సంబంధించిన లవర్స్ ఉంటారు. ఆ అమ్మాయిని చేసుకోవడానికి అంతకు ముందు ఎవడో పెళ్లి కొడుకు వచ్చి ఉంటాడు. వాడు దూరం నుండి జాలితో చూస్తుంటాడు. ఏ అర్ధరాత్రో వెళ్లి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు... ఇదే బిగ్బాస్ షో అని పృధ్వి అన్నారు.
Recommended Video
జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు
ఈ షో వల్ల ఎవరికి ఉపయోగం? జనాలను పిచ్చోళ్లను చేయడం తప్ప. వాడొచ్చి దీన్ని గిల్లాడు, వీడొచ్చి దాన్ని కదిలించాడు... బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు రండీ! వేరే పని పాటలు లేవు వీళ్లకు. ఇదేనా ఈ షోలో చూపించేది? అని పృధ్వీ వ్యాఖ్యానించారు.
అందుకే వెళ్లలేదు...
నిద్ర పోతున్నపుడు అందరూ ఒక చోటే అంట...నాకు నిద్రలో లేచే అలవాటుందయ్యా... ఎవడి పక్కలో పడుకుంటానో తెలియదు, రేపు పొద్దున్న పెద్ద గొడవైందనుకోండి... పృధ్వీరాజ్ తెలిసే ఒకావిడ పక్కలో పడుకున్నాడు అంటారు... అందుకే నేను ఈ షోకు వెళ్లలేదు అని పృధ్వి అన్నారు.
నేను, పోసాని, కేఏ పాల్ వస్తే... బిగ్బాస్ షోలో వాళ్లని కడిగిపారేస్తాం
రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నాకు వెళ్లే అవకాశం వస్తే... లోపలికి వెళ్లి అందరినీ కడిగేస్తా. అందులో ధర్మ పరిరక్షణార్థం ధర్మో రక్షతి రక్షిత: అని మాట్లాడే ఒకాయన ఉన్నారు. బిగ్బాస్ షోలో కరెక్ట్ మజా ఉండాలంటే పోసాని కృష్ణ మరళి రావాలి, పృధ్వీ రాజ్ రావాలి, డాక్టర్ కె.ఏ.పాల్ రావాలి. ఇలాంటి వాళ్లం ఉంటే మొత్తం కడిగి అవతల పారేసేవాళ్లం... అని పృధ్వి అన్నారు.
గోకాలన్నపుడు గోకడం, పడుకోవాలన్నపుడు పడుకోవడం
ఒకవేళ అవకాశం వస్తే సాయంత్రం ఆరు గంటల వరకే చేస్తాం. ఇలా అర్ధరాత్రి వరకు తిరిగే సంస్కృతి మాది కాదు. రాత్రంతా పని పాట లేకుండా తిరిగి, వాడొచ్చి దీన్ని గోకాడు, వీడొచ్చి దాన్ని గోకాడు లాంటివి మాకు తెలియదు. గోకాలన్నపుడు గోకడం, పడుకోవాలన్నపుడు పడుకోవడం అలా ఉంటే మేము రెడీ....అని పృధ్వి అన్నారు.