Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెబ్సైట్లలో చెత్తరాతలు.. వాడిని ఒక్క గుద్దుగుద్ది చంపాలనిపించింది.. కమెడియన్ రఘు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రం ద్వారా టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు కమెడియన్ రఘు అలియాస్ రఘు కారుమంచి. ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్తోపాటు ఇతర హీరోల చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు ఉన్న కమెడియన్గా మారాడు. కానీ ఆది సినిమా కంటే ముందు భారత్ బంద్ అనే చిత్రంలో రఘు నటించాడు. ఎన్టీఆర్కు ఇష్టమైన వారిలో రఘు ఒకరు అని చెప్పుకొంటారు. లేటుగానైనా లేటేస్టుగా వచ్చిన రఘు ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకొన్నారు. రఘు వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.
పలు బ్యాంక్ లోన్ల రికవరీ
సినిమాల్లోకి రాకముందు పలు బ్యాంకులకు బకాయి పడిన ఖాతాదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే పనిలో ఉండేవాడిని. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అమాయకుడిలా.. బుద్దుడిలా ఉండేవాడిని. బయటకు వస్తే నా వెంటా ఎప్పుడూ పదిమంది ఉండేవాళ్లు. ఎప్పడూ ఓ గ్రూప్ మెయింటెన్ చేసేవాడిని.
రికవరీతోపాటు సెటిల్మెంట్ దందాలు
లోన్ల రికవరీ, డబ్బులు వసూలుతోపాటు సెంటిల్మెంట్ దందా కూడా చేసేవాడిని. అలాంటి విషయాలు ఇంట్లోకి తెలిసేవి కాదు. కాబట్టి అలా నడిచిపోయేవి. కానీ ఓ సంఘటన మాత్రం చాలా సీరియస్ అయింది.
రఘు మర్డర్ అటెంప్ట్ దాకా
ఓ వ్యక్తిని ఒక్కటిచ్చుకోగా అది చాలా పెద్ద సమస్యగా మారింది. దాంతో వాడితో తాడో పేడో తేల్చుకోవాల్సి వచ్చింది. వాడు ఉండటమా? లేదా నేను పోవడమా అనే స్థాయికి పంచాయితీ వచ్చింది. మర్డర్ అంటెప్ట్ దాకా పోయింది ఆ వ్యవహారం.
గాసిప్స్ వార్తలపై రఘు ఫైర్
సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ పబ్లిష్లో స్వేచ్ఛను ఆధారంగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం చాలా కోపం తెప్పించింది. రఘు కూతుర్ని ఇంటికి తీసుకు రమ్మన్న ఎన్టీఆర్ అనే వార్తను చూసి రాసిన వాడిని చంపేయాలనేంత కోపం వచ్చింది.
గొంతు కొరికి చంపాలన్నంత కోపం
ఇతరుల ఇష్టాలను, పరువును కూడా పట్టించుకోకుండా వార్తలు రాసేవాడి గర్దన్ (గొంతు) కొరికివేయాలనేంత కొపం వచ్చింది. ఆ వార్త ఎలా ఉందంటే శవాల మీద పేలాలు ఏరుకొనే విధంగా ఉంటుంది.
గుద్దు గుద్ది చంపాలనిపించింది
అలాంటి వార్తలు రాసి వాడు ఏమి సాధిస్తాడు. ఎదురుగా కనిపిస్తే ఒక గుద్దు గుద్ది చంపేయాలనేంతగా మండింది. అలాంటి వార్తలు రాయడం ఎంత వరకు సబబు. రాసేటప్పుడు ఎదుటివాడికి కుటుంబం ఉంటుంది అనే ఆలోచన ఉండాలి.
ఊహించని విధంగా ఆర్థిక నష్టం
ఓ దశలో మూడు నెలలపాటు నిరాశ, నిస్పృహలో మునిగిపోయాను. జీవితంలో ఊహించని విధంగా ఆర్థికంగా నష్టపోయాను. అప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి సూర్యుడిని చూసిన దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చాను.
తెలిసినోడు మోసం
ఆర్థికంగా నష్టపోయిన మొత్తం చూసి బాధపడలేదు. కానీ నా బలహీన క్షణాలను వాడుకొని ఒకడు మోసం చేశాడు. అది డబ్బులు పోయిన దానికంటే నాకు ఎక్కువ బాధపెట్టింది. అలాంటి సమయంలో తెలిసినోడు ఎవడైనా మోసం చేస్తాడా?
కుటుంబం గడిస్తే చాలు..
ఏ వేషం వేస్తున్నామా అనేది ముఖ్యం కాదు. నా ఇద్దరు అమ్మాయిల చదువుకు, నా కుటుంబం గడవడానికి సరిపోయే ఆదాయం వస్తే చాలు. అంతేగానీ యస్ బాస్ పాత్రలు, చెంచా పాత్రలు వేస్తున్నానా అనే విషయాన్ని పట్టించుకోను. ఒకేరోజు లక్షలు లక్షలు సంపాదించాలన్న ఆశలేదు.
ఆత్మహత్య చేసుకొంటే లాభమేంటి?
జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటికి భయపడి ప్రాణం తీసుకొంటే ఏమోస్తుంది. విజయ్ ఆత్మహత్య చేసుకోవడం ప్రయోజనం ఏముంటుంది. పది నిమిషాలు బాధపడుతాం. ఓ గంట అతడి గురించి ఆలోచిస్తాం. తర్వాత మరిచిపోతాం. కాకపోతే నాకు ఓ సారి ఫోన్ చేస్తే బాగుంటుంది అని మాత్రం బాధపడ్డాను. ఇలా సాగిన ప్రోమో ఇంటర్వ్యూ పూర్తిభాగం శుక్రవారం సాయంత్రం ప్రసారం కానున్నది.