Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాళ్ళకోసమే గుండు కొట్టించుకున్నా, కాలుమీద కాలు ఏంటన్నారు: వేణుమాధవ్
Recommended Video
టాలీవుడ్ లో కమేడియన్ వేణూ మాధవ్ కి ఉన్న ప్రత్యేకత వేరు. కామెడీలో తనదైన టైమింగ్ .. బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకమైన మేనరిజంతో గిలిగింతలు పెట్టే వేణుమాధవ్, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. తన లైఫ్ లో ఎదురైన కొన్ని విచిత్రమైన అనుభవాలని ఇలా చెప్పాడు.
నిజమా లేక రూమరా
ఆ సమయం లో వేణూ మాధవ్ గుండుతో కనిపించటం తో చిరు మీద అభిమానంతోనే రీ ఎంట్రీగా వస్తున్న ఇనిమా హిట్ అవ్వాలని మొక్కు తీర్చుకొచ్చాడని చాలామంది చెప్పుకున్నారు. వెబ్సైట్లలో కూడా ఈ వార్త చాలా పాపులర్ అయ్యింది. అయితే అదై నిజమా లేక రూమరా అన్నది మాత్రం అర్థం కాలేదు.
గుండు నిజమే
ఈ ప్రశ్నకి సమాధానంగా చిరూ సినిమా కోసం తాను గుండు కొట్టించుకున్న మాట నిజమేననీ, బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం కూమా తిరుపతిలో గుండు కొట్టించుకున్నాననీ చెప్పాడు. "చిరూ 150 వ సినిమా కోసం .. బాలకృష్ణ 100వ సినిమా కోసం నేను 'గుండు' చేయించుకున్నాను.
వాళ్లిద్దరంటే చాలా ఇష్టం
వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం .. ఇద్దరితోను మంచి అనుబంధం వుంది. ఒక సినిమాకి వినాయక్ దర్శకుడైతే .. మరో సినిమాకి దర్శకుడు క్రిష్. వాళ్లిద్దరూ నాకు మంచి మిత్రులే. నటుడిగా నా రేంజ్ పెరిగేలా చేసింది వినాయక్ .. క్రిష్ తోను ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ సినిమాలు హిట్ కావాలని అలా చేశానే తప్ప .. వాళ్లను కాకా పట్టడం కోసం కాదు" అంటూ చెప్పుకొచ్చారు.
నేను ప్రూవ్ చేస్తాను
ఒక సినిమా షూటింగులో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు. " నేను ఒక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఆ సినిమా చేస్తోన్న ఓ పెద్ద హీరో నన్ను పిలిచారు. "ఏవయ్యా నువ్ కాలు మీద కాలేస్తావట గదా?" అని అడిగారు. "ఎవరు చెప్పారు మీకు ఆ విషయం" అని అడిగాను. "నేను ప్రూవ్ చేస్తాను ఆ విషయం" అంటూ ఎవరికో ఫోన్ చేస్తున్నారు.
ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను
ఆయనను అడ్డుకుంటూ "విషయమేంటో స్పష్టంగా చెప్పండి సార్" అన్నాను. "నువ్ కాలుమీద కాలేసుకుని కూర్చుంటావట గదా!" అన్నారు. " నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను సార్ .. నా కాలుమీద నా కాలేసుకుని కూర్చుంటాను .. అది తప్పెలా అవుతుంది సార్?" అన్నాను.
నువ్ మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా
దాంతో రెండు నిమిషాల పాటు ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తరువాత "నువ్ మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా .. సరే నీ ఇష్టం అలాగే కానీ " అన్నారు. "ఏం చేస్తాం .. అది నా అలవాటు .. ఆ తరువాత కూడా ఆ హీరోతో సినిమాలు చేశాను" అంటూ వేణుమాధవ్ చెప్పుకొచ్చారు.