దొంగసచ్చినోళ్లు!?!
కృష్ణ భగవాన్, రఘుబాబు హీరోలుగా దొంగసచ్చినోళ్లు సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం ప్రారంభం అయింది. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా ముహూర్తపు షాట్ కు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా మోహన్ బాబు కెమరా స్విచ్ఛాన్ చేశారు. ఈ షాట్ కు రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని కోగంటి రామకృష్ణ సమర్పిస్తుండగా సాంబశివరావు నిర్మిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. కామెడీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











