Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఊసరవెల్లి ఆడియోలో ఫంక్షన్ లో లాజిక్కులు..మ్యాజిక్కులు
జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఊసరవెల్లి". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగిన విషయం విధితమే. ఆ ఆడియో విడుదల కార్యక్రమానికి ముందుగా ప్రముఖ కామేడి నటులు వేణు, ధనరాజ్ లు ఓ కామెడీ బిట్ ను ప్రదర్శించారు. అయితే ఈ కామెడీ బిట్ లో..టాలీవుడ్ లో జరుగుతున్న అన్ని నిజాలను నవ్వుతూ చెప్పేశారు. గతంలో చిరంజీవి సినిమాలో 'బంగారు కోడిపెట్ట" సాంగ్ ఘనవిజయం సాధించింది. అదే పాటను 'మగధీర" చిత్రంలో రీమిక్స్ చేసి పెట్టారు. అంటే రాజమౌళి చేస్తే కాఫీ కాదు కానీ, నేను చేస్తే మాత్రం టీయా అంటూ నవ్వించిన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది..
అదే విధంగా ఈ మధ్య వస్తున్న సినిమాల పేర్లన్ని కూడా తిట్లతోనే ఉంటున్నాయి. పూరీ జగన్నాథ్ 'ఇడియట్" తీస్తే చూస్తారు, ఉపేంద్ర 'స్టుపిడ్" అనే చూస్తారు..కాని నేను 'బోసిడికే" అని తీస్తే ఎందుకు ఒప్పుకోరు..అవసరమైతే తర్వాత బట్టేబాద్ అనే చిత్రం కూడా వస్తుంది. అంటూ నవ్వించినా కూడా సెటైర్ పరంగా అక్కడున్న వారికి పంచ్ లు పడ్డట్టుగా అనిపించింది. ఇదే కామెడీ బిట్ లో అనుకుకుండా చరణ్ పేరు, చిరంజీవ పేరు వచ్చిన సమయంలో తారక్, వేణు, ధన్ రాజ్ లను తగ్గించండి అంటూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్లు అలాంటివేమి పట్టించుకోకుండా వాళ్ల స్టైల్లో అదరగొట్టి దొబ్బేసారు..