Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘దేనికైనారెడీ’ పై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ''మాకు మా సినిమాలు మనుగడ సాగించాలంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలు కావాలి. మేము ఏ ఒక్కర్నీ మనసు బాధపెట్టే విధంగా కావాలని ప్రయత్నించం. ఎక్కడైనా మాకు తెలియకుండా పొరపాట్లు జరిగి ఉంటే మా సంస్థలకు తెలియజేయవలసిందిగా అభ్యంతరం పెట్టేవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏ సినిమా అయినా సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే ప్రజల ముందుకు వస్తుంది. అంటే... అది ఒక ప్రభుత్వ డాక్యుమెంట్గా జనం ముందుకు వెళుతుందన్నమాట.
అలాంటి డాక్యుమెంట్లో ఏవైనా అనారోగ్యకరమైన అంశాలు ఉండిన పక్షంలో తమ అభ్యంతరాలను సెన్సార్వారికి తెలియపరచవచ్చు. అక్కడ కూడా ప్రాంతీయ సెన్సార్ మండలి, రివైజింగ్ కమిటీ, ట్రిబ్యునల్ అనే మూడు దశలున్నాయి. వారు విచక్షణతో మంచి, చెడులను పరిశీలిస్తారు. మరోవైపు ప్రభుత్వ పరిశీలన, ఆజమాయిషీ కూడా ఉంటుంది. ఇంకోవైపున మేము కూడా మా దృష్టికి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించే దిశగా వ్యవహరించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాం.
కాబట్టి దయచేసి ఏ ఒక్కరు లేదా సమూహం ఏ వ్యక్తి మీదా దాడి, దూషణ చేయడం కానీ, ఇళ్ల మీదకు రావడం కానీ, కార్యాలయాల ముందు ఎదుర్కోవడం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ సినిమాకైనా సెన్సార్వారిదే ఈ విషయంలో అల్టిమేట్ నిర్ణయం. వారు ఒకసారి సెన్సార్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సినిమా తీసిన నిర్మాత కూడా ఒక్క దృశ్యం లేదా సన్నివేశం లేదా డైలాగు తొలగించాలంటే సెన్సార్ వారి అనుమతి తప్పనిసరి. కావున ఏది జరిగినా ఆ సంస్థ ద్వారానే జరగడం అనేది అధికారికం. దయచేసి ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం''అన్నారు.