Don't Miss!
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ హీరో చేసిన పనికి... ఓ అమాయకుడి బుర్రబద్దలైంది!
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మీద కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన శోభిత్ అనే వ్యక్తి అర్జున్ రాంపాల్ తన మీద దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదు చేసారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆదివారం తెల్లవారు ఝామున 3.30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని షాంగ్రి-లా అనే హోటల్లోని నైట్ క్లబ్ లో డిజె ప్లే చేయడానికి అర్జున్ రామ్ పాల్ వచ్చాడు. పని పూర్తయ్యాక అక్కడి నుండి అర్జున్ రామ్ పాల్ బయటకు వెలుతుండగా ఓ ఫోటోగ్రాఫర్ అతడిని ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. ఫోటోలు తీయవద్దని వారించినా సదరు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడంతో... కోపానికి గురైన అర్జున్ రామ్ పాల్ అతడి కెమెరా లాక్కోని జనం ఉన్నవైపు విసిరాడు.
అయితే అది వెళ్లి శోభిత్ అనే వ్యక్తి తలకు తాకింది. దీంతో అతడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కంప్లైంట్ తీసుకున్నామని, అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఏది ఏమైనా బాలీవుడ్ హీరో ఆవేశంలో కోపంతో చేసిన పనికి ఓ అమాయకుడి బుర్ర బద్దలవ్వడం చర్చనీయాంశం అయింది.