Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరో పై ' సింహాద్రి' నిర్మాత ఫిర్యాదు
తాను డిసెంబరు 9న కోబ్రా అనే చిత్నానికి ముహూర్తం పెట్టుకున్నానని, అయితే సింహాద్రి చిత్రీకరణ పూర్తయిన తరువాతే ఆ చిత్రంలో నటిస్తానని విజయ్ స్పష్టీకరించారు. ఇచ్చిన తేదీల్ని గౌడర్ తక్షణమే వినియోగించుకుంటే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని సా.రా.గోవిందు విలేకరులకు తెలిపారు.
గతంలోనూ నటుడు విజయ్పై జిగణి పోలీసు స్టేషన్లో అపహరణ కేసు నమోదైంది. తన కుమారుడు ఆనంద్ను తన అల్లుడే అపహరించాడంటూ నాగరత్న తండ్రి జయణ్ణ ఫిర్యాదు చేశారు. ఆనంద్కు, రశ్మి అనే యువతిని ఇచ్చి వివాహం చేసేందుకు విజయ్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని దీన్ని తాము అడ్డుకున్నందుకే తన కుమార్తె నాగరత్నకు విడాకుల్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఆనంద్ను అపహరించుకు వెళ్లిన విజయ్ తనకు, అపహరణకు ఎటువంటి సంబంధం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.
చిన్న కారణాన్ని చూపి విజయ్ తన భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని నాగరత్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరో యువతిని వివాహం చేసేందుకు, తమ కుమారుడిని తమ నుంచి దూరం చేసేందుకే ఆయన ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు. దునియా విజయ్ 14 సంవత్సరాల క్రితం నాగరత్న ను పెళ్లాడాడు. వారికి ముగ్గురు సంతానం. కన్నడ మీడియా కథనాల ప్రకారం.....విజయ్ తన విడాకుల పిటీషన్లో భార్య నాగరత్న తనను మెంటల్గా టార్చర్ పెడుతోందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.