Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దర్శకుడు మారుతి పై కాపీ కంప్లైంట్
వివరాల్లోకి వెళితే... సతీష్ పాటల రచయిత సురేంద్ర కృష్ణ తో కలిసి ఓ స్క్రిప్టుని రెడీ చేసుకుని వెంకేటష్ కోసం వినిపించటం జరిగింది. ఇప్పుడదే స్క్రిప్టు కొద్ది మార్పులతో రాధ పేరుతో ప్రొడక్షన్ కి వెళ్తోందని కంప్లైంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివాదం దాసరి నారాయణ రావు దాకా వెళ్లినట్లు సమాచారం. దీనిపై దర్శకుడు మారుతి ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.
ఇక వెంకటేష్ వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించారు. రాజకీయ నేతగా మాత్రం ఆయన తెరపై ఎప్పుడూ కనిపించలేదు. ఆ ముచ్చట త్వరలోనే తీరబోతోంది. వెంకటేష్ కథానాయకుడిగా యూనివర్సల్ మీడియా పతాకంపై 'రాధా' అనే చిత్రం తెరకెక్కబోతోంది. నయనతార కథానాయిక. మారుతి దర్శకత్వం వహిస్తారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. జనవరి 16న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో వెంకటేష్ హోం మంత్రి పాత్రలో కనిపించి అలరించబోతున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''మారుతి తయారు చేసిన కథ చాలా బాగుంది. కథ వినగానే వెంకటేష్గారు ఈ సినిమా చేయడానికి తన అంగీకారం తెలిపారు. నయనతార కూడా కథ, పాత్రలపై ఆసక్తి కనబరుస్తూ నటించేందుకు ముందుకొచ్చింది. హోం మంత్రికీ, ఒక మధ్య తరగతి అమ్మాయికీ మధ్య సాగే ప్రేమాయణమే ఈ చిత్రం. ఇందులో వెంకటేష్ హోం మంత్రిగా కనిపించి వినోదం పంచబోతున్నారు. నయనతార మద్య తరగతి అమ్మాయిగా కనిపిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము''అన్నారు. ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: జె.బి., కూర్పు: ఉద్ధవ్, సమర్పణ: డి.పార్వతి.