twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకటనలపై ఛానళ్లకు నోటీసులు

    By Staff
    |

    Chandrababu Naidu
    'చీకటి నుంచి వెలుగులోకి' అన్న పేరుతో కొన్ని ప్రకటనలను ఛానెల్స్ లో తెలుగుదేశం పార్టీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో చంద్రబాబు పాలనలో అధికారులు స్వేచ్ఛగా పని చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం నిమిత్తం ఇస్తున్న ఈ ప్రకటనలు ప్రజల్లో స్పందన ఎలా ఉన్నా...కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్ ఇష్యూ గానే భావిస్తోంది. దాంతో వారు ఈ ప్రకటనల ప్రసారాలపై సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ లో కంప్లైంట్ చేసారు. అక్కడ నుంచి టీవీ ఛానళ్లకు నోటీసులు అందాయని సమాచారం.

    ఇదిలా ఉంటే...'అభయహస్తం' పేరిట పత్రికలలో జారీ చేసిన ప్రకటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వివిధ పక్షాల ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేంటో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్నీ ఆదేశించింది.

    ప్రజాధనంతో అధికార పార్టీ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రకటనలు జారీచేయడాన్ని తప్పుపడుతూ అల్లాడి పి.రాజ్‌కుమార్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌ రమేశ్‌ దవె, జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

    రాజకీయ దురుద్దేశంతో ప్రకటనలు జారీచేస్తున్నారని, వివిధ పక్షాల నేతలు ఏడవ తేదీన ఇచ్చిన విజ్ఞాపనపై తీసుకున్న చర్యలు వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్ట్‌ ఆదేశించింది. విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X