Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రకటనలపై ఛానళ్లకు నోటీసులు
ఇదిలా ఉంటే...'అభయహస్తం' పేరిట పత్రికలలో జారీ చేసిన ప్రకటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వివిధ పక్షాల ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేంటో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్నీ ఆదేశించింది.
ప్రజాధనంతో అధికార పార్టీ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రకటనలు జారీచేయడాన్ని తప్పుపడుతూ అల్లాడి పి.రాజ్కుమార్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవె, జస్టిస్ రమేశ్ రంగనాథన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
రాజకీయ దురుద్దేశంతో ప్రకటనలు జారీచేస్తున్నారని, వివిధ పక్షాల నేతలు ఏడవ తేదీన ఇచ్చిన విజ్ఞాపనపై తీసుకున్న చర్యలు వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్ట్ ఆదేశించింది. విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.