twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడుకో..వదిలేయ్

    By Staff
    |

    Chandrababu Naidu
    వాడుకో..వదిలేయ్ అనే సిద్దాంతాన్ని విజయవంతంగా అమలుచేసిందెవరు..వెన్నుపోటు దారుగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరు...టూరిజం తప్ప కమ్యూనిజం లేదని చెప్పిందెవరు..రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే కరెంట్ తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అని చెప్పి ఫూల్ అయిందెవరు..టీపీడీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని నిరూపించిన వ్యక్తి ఎవరు..రాత్రి బారు-పగలు దర్బారు అని కేసీఆర్ ను ఎద్దేవా చేసిందెవరు ఈ ప్రశ్నలతో టీవీ ఛానెళ్ళలో ఓ పోగ్రాం వస్తోంది. దీని పేరు 'రండి..జ్ఞానం పొందండి'. చంద్రబాబు, వామపక్షాలు, టీఆర్ ఎస్ లపై వ్యగ్యాస్త్రాలతో కాంగ్రెస్ శాసన సభా పక్షం రూపొందించిన ప్రకటన ఇది.

    ఎంతో ప్రజాదారణ పొందిన కౌన్ బనేగా కరోడపతి క్విజ్ కార్యక్రమం మాదిరిగా, సీఎల్పీ ఒక్కో ప్రకటన నిడివి యాభై సెకెండ్లకు మించకుండా మొత్తం పదకొండు బాఘాలను విడుదల చేసింది. ఒక్కో ప్రకటన చివర్లో కొంగ జపం-దొంగతపం జనం నమ్మరు అనే సూక్తిని చేర్చారు. చంద్రబాబు నైజాన్ని ఎండగడతూ, లెప్ట్, టీఆర్ ఎస్ పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశ్శంతో ఈ ప్రకటనలను రూపొందించినట్లు సీఎల్పీ వర్గాలు తెలిపారు. అలాగే అప్పట్లో ఎన్టీఆర్..చంద్రబాబుపై చేసిన విమర్శలను వీటిలో చేర్చారు. ఇక ఈ యాడ్ లు వినటానికి బాగున్నా...ఎంతవరకూ సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X