Don't Miss!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్నికల కోడ్: చెర్రీ, చిరంజీవి అభిమానులపై కేసు
హైదరాబాద్/విజయవాడ: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ, చిరు అభిమానుల పైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు జిహెచ్ఎంసి అధికారులు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో రామ్ చరణ్ పైన, పలువురు చిరు అభిమానుల పైన పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పుట్టిన రోజు వేడుకల రోజు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) అభియోగం.
కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు గురువారం ఉదయం హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రామ్ చరణ్కు పుట్టిన రోజు విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. రాష్ట్ర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసారు.
ఈ సందర్భంగా అభిమానులు రూపొందించిన 'ఫ్యాన్స్ తో ఫ్యాన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అభిమానుల అండ ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నాగబాబు మాట్లాడుతూ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు.