Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘రెడ్డి గారు పోయారు’ ..వర్మకు వార్నింగ్
వివాదాలతో సావాసం చేయడం అంటే రామ్ గోపాల్ వర్మకు మహా ఇష్టం. అందుకే కాబోలు ఆయన వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడానికే ఆసక్తి చూపుతుంటారు. తాజాగా వర్మ తనకొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 'రెడ్డి గారు పోయారు' అనేది దాని టైటిల్. అయితే ఈ సినిమా టైటిల్ పై 'రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ' ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే టైటిల్ మార్చాలని వర్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై వాళ్లు హ్యూమన్ రైట్స్ కమీషన్ను సంప్రదించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రామ్ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..? చూడాలి.
గతంలో వర్మ నిర్మించిన 'బెజవాడ' సిమాతో పాటు, 'రక్త చరిత్ర' సినిమాపై కూడా అనేక వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వివాదాలు ఏమీ లేక పోవడంతో మిన్నకున్న వర్మ తాజాగా వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై 'రెడ్డి గారు పోయారు' అనే సినిమాకు ప్లాన్ చేశారు. ఇందులో వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను చిత్రీకరించనున్నారు.