Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రెడ్డి గారు పోయారు’ ..వర్మకు వార్నింగ్
వివాదాలతో సావాసం చేయడం అంటే రామ్ గోపాల్ వర్మకు మహా ఇష్టం. అందుకే కాబోలు ఆయన వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడానికే ఆసక్తి చూపుతుంటారు. తాజాగా వర్మ తనకొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 'రెడ్డి గారు పోయారు' అనేది దాని టైటిల్. అయితే ఈ సినిమా టైటిల్ పై 'రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ' ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే టైటిల్ మార్చాలని వర్మకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై వాళ్లు హ్యూమన్ రైట్స్ కమీషన్ను సంప్రదించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రామ్ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..? చూడాలి.
గతంలో వర్మ నిర్మించిన 'బెజవాడ' సిమాతో పాటు, 'రక్త చరిత్ర' సినిమాపై కూడా అనేక వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వివాదాలు ఏమీ లేక పోవడంతో మిన్నకున్న వర్మ తాజాగా వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై 'రెడ్డి గారు పోయారు' అనే సినిమాకు ప్లాన్ చేశారు. ఇందులో వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను చిత్రీకరించనున్నారు.