Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరి జగన్నాధ్ 'పోకిరి' కధ పై కాపీ కేసు
మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ "పోకిరి" చిత్రం రీమేక్ గా వచ్చిన వాంటెడ్ చిత్రం ఇప్పుడు కధా చౌర్యం కేసులో ఇరుక్కుంది. వాంటెడ్ చిత్ర కథని తన నుంచి కాపీ కొట్టారని బీర్బల్ సింగ్ రానా అనే వ్యక్తి ముంబైలో కేసు వేసారు. అతను వాంటెడ్ కథని 2004 లోనే రిజిస్టర్ చేసినట్లు ఆధారాలు చూపుతున్నారు. దాంతో వాంటెడ్ చిత్ర నిర్మాతలు శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్ కేసులో ఇరుక్కున్నారు. బోనికపూర్, శ్రీదేవి లకు చెందిన సంస్థ బీఎస్ కే నెట్ వర్క్ తన రచనను కాపీ చేసిందని బీర్బల్ సింగ్ రాణా కోర్టులో కేసు వేసారు. ఆగష్టు 18వ తేదిన హాజరు కావాల్సిందిగా బోని, శ్రీదేవిలను ఆదేశించింది. వారు హజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఇష్యూ చేసింది. వారిని నవంబర్ 22న కోర్టుకు తప్పని సరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇక హిందీలోనూ ఈ చిత్రం కథ అన్న చోట పూరి జగన్నాధ్ పేరు వేసారు. పోకిరి చిత్రం 2006లో విడుదల అయింది.