Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా ఎఫెక్ట్: నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. ఒక్క మనిషి తప్ప అంతా అంటూ!!
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచదేశాలకు విస్తరించి ఇప్పటికే వేలాది మంది మరణించారు. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్లిస్తోంది. దీంతో అన్నిదేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై వైద్య బృందాలను రంగంలోకి దించాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..
హైదరాబాద్ చేరిన కరోనా వైరస్
క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ ఇటీవలే హైదరాబాద్ నగరాన్ని కూడా చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఒక కేసు, ఢిల్లీలో మరోకేసు నమోదు కావడంతో తెలంగాణ సహా భారత ప్రజానీకం పలు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది.
మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతే..
తాజాగా ఇదే కరోనా ఎఫెక్ట్ అంశంపై స్పందించిన నాగబాబు.. ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతే.. ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయని అన్నారు. మానవుడు లేకుంటే మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయని చెప్పారు.
కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప అందరూ..
''సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని, కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప'' అని నాగబాబు ట్వీట్లు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్లు చూసి నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. 'ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఛార్మి క్షమాపణలు.. కరోనా ఎఫెక్ట్
ఇటీవలే ఛార్మి సైతం కరోనా పై స్పందించి చివరకు సారీ చెప్పింది. కరోనా వచ్చింది.. ఆల్ ది బెస్ట్ అంటూ వీడియో పోస్ట్ చేసి ఛార్మి చిక్కుల్లో పడింది. చాలామంది ఛార్మి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో చివరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరింది ఛార్మి.
Recommended Video
ఉపాసన సహా టాలీవుడ్ సెలబ్రిటీలు
ఇకపోతే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొణిదెల ఉపాసన సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ధరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఎయిర్ పోర్ట్లో మాస్క్ ధరించి కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవడం, ఆ ఫొటోలో వైరల్ కావడం జరిగాయి.