Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున ఫామ్ హౌస్లో విషాదం.. కూలీలుగా పనిచేస్తున్న దంపతుల మృతి, కారణం ఏంటంటే!
అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివారులోని పాపి రెడ్డి గూడ ప్రాంతంలో నాగార్జునకు ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో నాగార్జున వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట రాజు(32), దుర్గ (30) దంపతులు ఈ ఫామ్ హౌస్ లో కూలీలుగా పనిచేస్తున్నారు.
అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో ఈ దంపతులిద్దరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దంపతులిద్దరూ ఫామ్ హౌస్ లోనే నివాసం ఉంటున్నారు. గత రాత్రి నుంచి ఇంట్లో కరెంటు పోవడంతో వెంకట రాజు ట్రాన్స్ ఫార్మర్ ని పరిశీలించడానికి వెళ్ళాడు. అక్కడ తెగిపడి ఉన్న విద్యుత్ తీగని గమనించకపోవడంతో షాక్ తగిలి మృతువాత పడ్డాడు. భర్త విలవిల లాడుతుంటే దుర్గ కూడా అక్కడకు వెళ్లి విధ్యుత్ ఘాతానికి గురై మరణించింది.
దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించిన విషాదఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.