Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చట్ట వ్యతిరేకంగా...సొనాలి బింద్రే, టబు, కేసు
జోధ్పూర్: బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, సొనాలి బింద్రే, టబు, నీలంలపై 14 ఏళ్ల కిత్రం కృష్ణ జింకను వేటాడినట్లు శనివారం తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. వారిపై వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 9/51, 9/52, ఐపీసీ 149 ప్రకారం అభియోగాలు నమోదు చేసినట్లు జోధ్పూర్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చంద్రకళ జైన్ తెలిపారు. అయితే తమపై వచ్చిన అభియోగాలను నటులు కొట్టిపారేస్తున్నారు.
బాలీవుడ్ నటీ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలమ్లపై వన్యప్రాణి చట్టం కింద చార్జ్షీట్ దాఖలైంది. 14 సంవత్స రాల క్రితం వీరు ఐదుగురూ కృష్ణజింకలను వేటాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు శనివారం నాడు చార్జ్షీట్ను దాఖలు చేశారు. వచ్చే నెల నుంచి విచారణ ప్రారంభం కానుంది. విచారణ అనంతరం నేరం రుజువైతే వీరికి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు వెల్లడించారు.
సల్మాన్ఖాన్పై గతంలో వాడిన ఆయుధ చట్టాన్ని ఈ చార్జ్షీట్లో ఉపసంహరిం చుకున్నారు. సైఫ్ అలీ, తబు, నీలమ్, సోనాలీలపై వేటకు ప్రోత్సహించిన నేరాన్ని, చట్ట వ్యతిరేకంగా అడవుల్లో సమావేశమైన నేరాన్ని మోపారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ చంద్రకళా జైన్ వీరిపై వున్న ఆరోపణలను చదివారు. వన్యప్రాణి రక్షణ చట్టం,సెక్షన్ 9/51, 9/52, ఐపీసీ సెక్షన్ 149 కింద వీరిపై ఆరోపణలు వున్నట్టు వెల్లడించారు.
తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తమపై న్యాయమూర్తి చదివిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్టు నటీ నటులు తెలిపారు. సల్మాన్ ఖాన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి వున్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేక పోయారని సల్మాన్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. 1998 అక్టోబర్ 1, 2 తేదీల్లో జోధ్పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో వీరంతా కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడారని ఆరోపణ. హమ్ సాథ్ సాథ్ హై (తెలుగులో ప్రేమానురాగం) చిత్రం షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. కృష్ణజింకలను వేటాడటం, చంపడం భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్షింపదగ్గ నేరం.