Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ప్రభాస్ ‘సాహో’ మూవీ హీరోయిన్ శ్రద్ధా కపూర్పై క్రిమినల్ కేసు!
Recommended Video
బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుతం ప్రభాస్తో కలిసి 'సాహో' చిత్రంలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. ప్రముఖ దుస్తుల డిజైన్ కంపెనీ ఆమెతో పాటు నిర్మాత నహీద్ ఖాన్ మీద ఈ కేసు వేశారు. వాస్తవానికి ఈ కేసులో శ్రద్ధా కపూర్ ఉద్దేశ్య పూర్వకంగా చేసింది ఏమీ లేదు, 'హసీనా పార్కర్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో ఆమె కూడా ఈ కేసులో ఇరుక్కోక తప్పలేదు.
ఏం జరిగింది?
ఈ ఏడాది శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో ‘హసీనా పార్కర్' అనే సినిమా వచ్చింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ధరించిన దుస్తువులను డిజైన్ చేయడానికి ఓ ప్రముఖ డిజైనర్ ‘ఎం అండ్ ఎం' సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే దర్శక నిర్మాతలు కాంట్రాక్టును ఉల్లంఘించడంతో వారు కోర్టుకెక్కారు.
కంపెనీ పేరు వేయక పోవడం వల్లే...
ముంబైకి చెందిన ఓప్రముఖ దుస్తుల కంపెనీ ‘ఎం అండ్ ఎం'తో నిర్మాత కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం సినిమాలో ‘ఎం అండ్ ఎం' పేరు వేయాలి. సినిమాలో తమ కంపెనీ పేరు ఎక్కడా కనిపించక పోవడంతో సదరు సంస్థ నిర్మాత నహిద్ ఖాన్, శ్రద్ధా కపూర్పై అంధేరీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఎంక్వయిరీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
హసీనా పార్కర్
‘హసీనా పార్కర్' ఈ ఏడాది సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. నహిద్ ఖాన్ నిర్మాత. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
‘సాహో' చిత్రంలో శ్రద్ధా కపూర్
ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘సాహో' చిత్రంలో నటిస్తోంది. బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నెక్ట్స్ ‘సైనా నెహ్వాల్' బయోపిక్
‘సాహో' సినిమా తర్వాత శ్రద్ధా కపూర్ ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించబోతున్నారు. శ్రద్ధా కపూర్ తన కెరీర్లో చేస్తున్న తొలి బయోపిక్ మూవీ ఇదే.