twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కరెంట్‌' ట్రిపుల్‌ ప్లాటినమ్‌ వేడుక

    By Staff
    |

    అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్‌ కార్పొరేషన్‌ పతాకంపై సుశాంత్‌ హీరోగా చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన 'కరెంట్‌' చిత్రం ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ ను ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ 'మా తొలి చిత్రం 'కాళిదాసు' వందరోజులకు ఎంత వసూలు చేసిందో ఈ చిత్రానికి మొదటివారంలోనే అంత వచ్చింది. మొదటి వారం రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల మూడు వేల అయిదు వందల ఎనభై అయిదు రూపాయల గ్రాస్‌ కలెక్షన్లు లభించాయి. సుశాంత్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యూత్‌ కి సినిమా బాగా రీచ్‌ అయింది. సంగీతం, ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్స్‌గా నిలిచాయి.

    దర్శకుడు బాగా తీశాడు. ఈ నెల 28న విజయవాడలో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్నాం. అమెరికాలో, ఆస్ట్రేలియాలో మనవారి మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ, ప్రవాస భారతీయులకు నైతిక మద్దతు ఇవ్వడం కోసం ఒక నిముషం పాటు మౌనాన్ని పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. దేవిశ్రీప్రసాద్‌ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ తర్వాత 'కనెక్టింగ్‌ హార్ట్స్‌' పేరుతో విజయయాత్రను నిర్వహిస్తాం' అన్నారు. హీరో సుశాంత్‌ మాట్లాడుతూ ' విజయవాడలో జరిగే ఫంక్షన్‌లో దేవిశ్రీప్రసాద్‌గారితో పాటు నేను, స్నేహా ఉల్లాల్‌ కూడా స్టెప్స్‌ వేయనున్నాం. మంచి ఓపెనింగ్స్‌తో ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు' అన్నారు. చిత్రం బాగా ఉందంటూ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అభినందించడం మరువలేనని ఎ.నాగసుశీల చెప్పారు.

    అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్‌ కార్పొరేషన్‌ పతాకంపై సుశాంత్‌ హీరోగా చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన 'కరెంట్‌' చిత్రం ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ ను ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ 'మా తొలి చిత్రం 'కాళిదాసు' వందరోజులకు ఎంత వసూలు చేసిందో ఈ చిత్రానికి మొదటివారంలోనే అంత వచ్చింది. మొదటి వారం రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల మూడు వేల అయిదు వందల ఎనభై అయిదు రూపాయల గ్రాస్‌ కలెక్షన్లు లభించాయి.

    సుశాంత్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యూత్‌కి సినిమా బాగా రీచ్‌ అయింది. సంగీతం, ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్స్‌గా నిలిచాయి. దర్శకుడు బాగా తీశాడు. ఈ నెల 28న విజయవాడలో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్నాం. అమెరికాలో, ఆస్ట్రేలియాలో మనవారి మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ, ప్రవాస భారతీయులకు నైతిక మద్దతు ఇవ్వడం కోసం ఒక నిముషం పాటు మౌనాన్ని పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. దేవిశ్రీప్రసాద్‌ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

    ఆ తర్వాత 'కనెక్టింగ్‌ హార్ట్స్‌' పేరుతో విజయయాత్రను నిర్వహిస్తాం అన్నారు. హీరో సుశాంత్‌ మాట్లాడుతూ 'విజయవాడలో జరిగే ఫంక్షన్‌లో దేవిశ్రీప్రసాద్‌గారితో పాటు నేను, స్నేహా ఉల్లాల్‌ కూడా స్టెప్స్‌ వేయనున్నాం. మంచి ఓపెనింగ్స్‌తో ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు' అన్నారు. చిత్రం బాగా ఉందంటూ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అభినందించడం మరువలేనని ఎ.నాగసుశీల చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X