Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచు బ్రదర్స్: సన్నీ లియోన్ పేరు చెప్పి 25 దేశాల్లో...
హైదరాబాద్: మంచు విష్ణు నిర్మాతగా....మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో జి నాగేశ్వరరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కరెంటు తీగ'. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో విడుదల చేస్తున్నారు.
సన్నీ లియోన్ సినిమాలో నటించడంతో పబ్లిసిటీకి ఎక్కువగా ఆమె గ్లామర్ను ఉపయోగించుకుంటున్నారు మంచు బ్రదర్స్. సన్నీ లియోన్ నటిస్తుండటం వల్లనే ఆయా దేశాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'A' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.
ఈ చిత్ర నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ.....సన్నీ లియోన్ స్పెషల్ సాంగు వల్లే సినిమాకు 'A' సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. అలా అని సినిమాలో ఆమె వల్గర్ పాత్ర ఏమీ చేయడం లేదు. సంప్రదాయ బద్దంగా టీచర్ పాత్ర పోషిస్తోంది. సాంగులో మాత్రం కాస్ల గ్లామరస్గా కనిపిస్తుందని తెలిపారు.
గతంలో మంచు మనోజ్ చిత్రాలకు ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఈ చిత్రంలో నటిస్తుండటమే. ఆమె చేసేది చిన్న పాత్రే అయినా....ఆమె కారణంగా సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చింది.
అందుకు తగిన విధంగానే ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేసారు. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ మంచు మనోజ్ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమెకు రూ. 75 లక్షలు ఆఫర్ చేసారట. ఆమె వల్ల సినిమాకు చేకూరే ప్రయోజనం దృష్ట్యా ఆ మాత్రం ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు. సన్నీ లియోన్ ఈచిత్రంలో టీచర్ పాత్రలో కనిపించనుంది. ఆమె భర్త పాత్రలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు.
మంచు మనోజ్ కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు రూపొందించిన ‘కరెంట్ తీగ' ఈనెల 17న విడుదల అవ్వాల్సి ఉండగా హధూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేక పోవడంతో విడుదల వాయిదా వేసిన సంగతి తెలసిందే. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సంపూర్ణేష్బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.