Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఊసరవెల్లి'లో కరెంటు వైర్ డైలాగ్
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవిల్లి ఆడియో నిన్న (గురువారం) రాత్రి విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్లో చివరగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమాలో హైలెట్ గా చెప్పుకునే డైలాగ్ ఒకటి చెప్పారు. అదే.. కరెంట్ తీగ కూడా నాలానే సన్నాగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాక్ కొట్టేస్తుంది.... అంటూ... ఆ డైలాగుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాత్సోహాలతో కేరింతలు కొట్టారు. అలాంటివి చాలా డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఈ చిత్రంలో డైలాగులను కొరటాల శివ రాసారు. అంతకు ముందు బృందావనంలో కూడా ఎన్టీఆర్ కు రచ్చ రచ్చే అనే డైలాగు రాసి శివ చప్పట్లు కొట్టించుకున్న సంగతి తెలిసిందే.పరిస్థితులకి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని సక్రమ మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది 'ఊసరవెల్లి' లోని ప్రధానాంశం. ఎవరూ ఊహించని మలుపులతో నడిచే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్ప్లే ప్రధానాకర్షణలు అంటున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు.
అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్ రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.