Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్టర్ గా మారబోతున్న రైటర్ డైమండ్, యువ హీరోతో సినిమా!
కామెడీ సినిమాలు తగ్గిపోతున్న సమయంలో తనదైన వినూత్న శైలితో డైలాగ్స్ తోనే ప్రేక్షకుల మనసులకు చక్కిలిగింతలు పెట్టె డైమండ్ రత్నబాబుకు ఓంకార్ అవుట్ డోర్ యూనిట్ వారు నిర్మాతలుగా మారి అవకాశం ఇచ్చారు. అలాగే సందీప్ కిషన్ తో ''ఒక్క అమ్మాయి తప్పా'' సినిమాను నిర్మించిన అంజిరెడ్డి ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దర్శకుడిగా మారబోతున్న రైటర్
తెలుగులో ప్రస్తుతం దర్శకుడు కావాలంటే సులువైన మార్గం ఏంటంటే ముందు రచయితగా కొన్ని సినిమాలు చెయ్యాలి. ఆ అనుభవంతో దర్శకత్వం వహించి సక్సెస్ సాధించవచ్చని చలా మంది నిరూపించారు. ఈ కోవలోనే త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నాడు రైటర్ డైమండ్ రత్నబాబు. 'సీమశాస్త్రి'తో మొదలుపెట్టి.. పిల్లా నువ్వులేని జీవితం, భాయ్, పాండవులు పాండవులు తుమ్మెద, ఈడోరకం ఆడోరకం వంటి సినిమాలకు రచయితగా పనిచెయ్యడం జరిగింది.
కొరటాల శివ తరహాలో
త్రివిక్రమ్ దగ్గర్నుంచి కొరటాల శివ వరకు రైటర్ టర్న్డ్ డైరెక్టర్స్ గొప్ప పేరు సంపాదించారు. నిర్మాతలు కూడా ప్రస్తుతం రైటర్ గా అనుభవం ఉన్నవాళ్లకే దర్శకులుగా ఈజీగా అవకాశాలిస్తున్నారు. కామెడీ సినిమాలు తగ్గిపోతున్న సమయంలో తనదైన వినూత్న శైలితో డైలాగ్స్ తోనే ప్రేక్షకుల మనసులకు చక్కిలిగింతలు పెట్టె డైమండ్ రత్నబాబుకు ఓంకార్ అవుట్ డోర్ యూనిట్ వారు నిర్మాతలుగా మారి అవకాశం ఇచ్చారు. అలాగే సందీప్ కిషన్ తో ''ఒక్క అమ్మాయి తప్పా'' సినిమాను నిర్మించిన అంజిరెడ్డి ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
యువహీరోతో మూవీ
విభిన్నమైన కథ, కథనాలతో డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారబోతున్నాడు. ఒక యువహీరో ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
డైమండ్ సప్తగిరితో సినిమా
ప్రస్తుతం డైమండ్ రత్నబాబు సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కబోతున్న సినిమకు రచయితగా పని చేస్తున్నారు. రచయితగా పలు విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసిన డైమండ్ రాత్నబాబు దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.