Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'దళం'.. విడుదల తేదీ ఖరారు
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈచిత్రం గత సంవత్సరం డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చాలా కాలం క్రితమే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో కూడా గత డిసెంబర్లో విడుదలైంది. కానీ ఈ చిత్ర నిర్మాతలు సరైన విడుదల సమయం లేదని పక్కన పెట్టారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన పియాబాజ్పేయ్ నటించింది. జన జీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల జీవితం తర్వాత ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.
దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .
నిర్మాత సుమంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. త్వరలో విడుదల చేస్తాము''అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్ నర్తించింది. ఈ చిత్రంలో నవీన్చంద్ర, పియాబాజ్పేయ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: సుధాకర్ యక్కంటి, సంగీతం: జేమ్స్ వసంతన్.