Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘దళం’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈచిత్రం గత సంవత్సరం డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన పియాబాజ్పేయ్ నటించింది. జన జీవన స్రవంతిలో కలిసి నక్సలైట్ల జీవితం ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.
చిత్రం కథ గురించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .
నిర్మాత సుమంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది'అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్ నర్తించింది. ఈ చిత్రంలో నవీన్చంద్ర, పియాబాజ్పేయ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: సుధాకర్ యక్కంటి, సంగీతం: జేమ్స్ వసంతన్.