Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
‘ఢమరుకం’తో మనోభావాలు దెబ్బతీసారంటూ ఆందోళన
హైదరాబాద్ : ఢమరుకం సినిమాలో కటిక వృత్తిదారుల మనోభావాలను కించపర్చే విధంగా జోడించిన కసాయి పదాన్ని వెంటనే తొలగించాలని అరె కటిక హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని దేవి థియేటర్ ముందు ఆరెకటిక వృత్తిదారులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరెకటిక హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపిక సుధాకర్, ఈశ్వర్, గురుచరణ్, ప్రవీణ్, సురేశ్ లు మాట్లాడుతూ ఢమరుకం సినిమాలో కసాయి పదాన్ని తొలగించాలని అన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని పేర్కొన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న చిక్కడపల్లి ఎస్ఐ ప్రభాకర్ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను శాంతింపచేసి పంపించారు.
ఆరెకటికల మనోభావాలను కించపరిచే విధంగా ఢమరుకం సినిమాలో కసాయి అనే పదాన్ని వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఆరెకటిక పోరాటసమితి ఆందోళన చేసింది. శనివారం ఢమరుకం సినిమా ప్రదర్శిస్తున్న ఆర్టీసీ క్రాస్రోడ్డులోని దేవి థియేటర్లో మధ్యాహ్నం ఆటను చూడటానికి వచ్చిన సమితి నాయకులు సినిమా మధ్యలో హాల్లోనే ఆందోళన చేశారు. చిత్ర పోస్టర్లను, ప్లెక్సీలను చించేశారు.
పోలీసులు ఆందోళనకారులను బయటకు తీసుకురాగా... హాల్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగికార్ సుధాకర్ మాట్లాడుతూ ఢమరుకం సినిమా డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హీరో నాగార్జునపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సంఘ ప్రతినిధులు ప్రవీణ్కుమార్ లాల్, ఈశ్వర్లాల్, గురుచరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' శుక్రవారం విడుదల అయ్యింది.డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్స్ ని ,ఎగ్జిబిటర్స్ ని ఆనందపరిచింది. ఈ వీకెండ్ రెండు రోజులు అదే కలెక్షన్స్ కంటిన్యూ అవుతాయని అంటున్నారు.