Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవి.. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో!
ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసే టెలివిజన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్లో 'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవి దక్కింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్గా ఆయనను నియమించడం జరిగింది. ఇప్పటికే సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవిలో కొనసాగుతుండగా, తాజాగా 'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు.
తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త శ్రీ వేంకటేశ్వర్లు (తిరుపతి), ఎస్వీబీసి ఛైర్మన్ పృథ్వీ, తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ (వైఎస్ఆర్సిపీ), 'రాగల 24 గంటల్లో' చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు హాజరయ్యారు. 'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డికి పృథ్వీ శాలువా కప్పి సన్మానం చేశారు. ఇక వీరందరి సమక్షంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్గా శ్రీనివాస్ రెడ్డి నియమితులు కాబోతున్నారనే వార్త సెన్సేషన్ అయింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి అనగానే అందరూ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనుకొని ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. కానీ అది తానూ కాదని ఆయన ఢమరుకం దర్శుకుడు శ్రీనివాస్ రెడ్డి అని కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో ఆ విషయం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది.