Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
'దమ్ము' విడుదల గురించి ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రం 'దమ్ము"మార్చి 2012 లో విడుదల కానుందని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ...దమ్ము అనే టైటిల్ నే ఖరారు చేసామని,అయితే నిర్మాత కె ఎస్ రామారావు అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారని అన్నారు.ఈ నెలాఖరునుంచి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జరుగుతుందని,తాను పాల్గొంటానని అన్నారు. అలాగే దమ్ము పక్కా మాస్ మూవీ అని, హై వోల్టేజ్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషన్, గ్లామర్ తో తన అభిమానలుకు పూర్తి స్ధాయి విందులా ఉంటుందని అన్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లో ఆరంభమైంది. కానీ ఊసరవెల్లి చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ 'దమ్ము" దర్శక, నిర్మాతలు బోయపాటి శ్రీను, కె ఎస్ రామారావును కొంత వ్యవధి కావాలని కోరటంతో ఈ చిత్ర షూటింగ్ ను కొంతకాలం నిలిపివేశారు.
ఎంఎం కీరవాణి ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం పాటలు కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. సింహా విజయంతో ఊపు మీద ఉన్న బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ఎలాగైనా సూపర్ హిట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఊసరవెల్లి చిత్రం డివైడ్ టాక్ ఉన్నా కలెక్షన్స్ పరంగా ఎక్కడా డ్రాప్ కాకుండా నడుస్తోంది.