Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హైదరాబాద్ లో దారుణం: డ్యాన్సర్పై గ్యాంగ్ రేప్
ఈనెల రెండో తేదీన వర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చివరకు ఒక ప్రభుత్వేతర సంస్థ జోక్యంతో మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నీలిచిత్రాలు రూపొందించే ముఠా ప్రమేయం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్లో ఉన్న ఈవెంట్ కో ఆర్డినేటర్ను విచారించారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లో డ్యాన్స్ చేసేందుకు రూ.లక్ష చెల్లిస్తామని నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమం కోసం బాధితురాలు డిసెంబరు 31న హైదరాబాద్కు విమానంలో చేరుకోగా ఈవెంట్ నిర్వాహకులు నలుగురు ఆమెను కలుసుకున్నారు. విమానాశ్రయం నుంచి సుమారు అరగంట ప్రయాణం తర్వాత హోటల్కు తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు డ్యాన్స్ ఉంటుందని, అంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఏదో శీతల పానీయం ఇచ్చారు.
స్పృహలోకి రాగా బోరివలికి వచ్చే లగ్జరీ బస్సులో ఉన్నానని బాధితురాలు పేర్కొన్నారు. అంథేరీలో బస్సు దిగి పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని, రెండు రోజులు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వేతర సంస్థ జనశక్తి ఫౌండేషన్ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
నిందితులు తన డెబిట్ కార్డులు, ఆభరణాలు, సెల్ఫోన్, రూ.17,000 నగదు అపహరించినట్లు ఆరోపించారు. ముంబయికి బస్సు టిక్కెట్ను ఇస్మాయిల్ షేక్ అనే వ్యక్తి బుక్ చేశాడని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో జరిగిన కొత్త ఏడాది పార్టీల వివరాలను సేకరిస్తున్నారు