Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కిరాకత గ్యాంగ్ కథ ‘దండుపాళ్యం’
హైదరాబాద్ : కన్నడలో మంచి విజయం సాధించిన 'దండు పాళ్యం' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. పూజా గాంధీ, రవిశంకర్, మకరంద్, నిషా కొఠారి తదితరులు నటించిన ఈచిత్రానికి శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. నిర్మాత వెంకట్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుక శనివారం ఫిలించాంబర్ లో జరిగింది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై సీడీని ఆవిష్కరించగా...దర్శకురాలు బి.జయ తొలి సీడీని అందుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈచిత్రం వెబ్ సైట్ ప్రారంభించారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ...అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం ఒకతను 80 మందిని మర్డర్ చేస్తాడు. దండుపాళ్యం గ్యాంగ్ గురించి ఓ జర్నలిస్టు రాసిన ఆర్టికల్ ఈ చిత్రానికి బేస్. తెలుగులోనూ ఈచిత్రం హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈచిత్రానికి పాటలు : భువన చంద్ర, సంగీతం : అర్జున్ జన్య.