Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దండుపాళ్యం గ్యాంగ్ మళ్లీ వస్తుంది.. ఈ సారి కొంచెం కొత్తగా..
Recommended Video
దండుపాళ్యం.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది సభ్యులు గ్యాంగ్గా ఏర్పడి దోపిడీలు, రేప్లు, హత్యలు చేస్తూ ఉంటారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేయడం.. జైలు నుంచి తప్పించుకోవడం.. ఇలా ఈ సినిమా మూడు భాగాలుగా విడుదలైంది. ఈ మూడింటికీ మంచి రెస్పాన్సే వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ మరో భాగం తెరకెక్కించింది. అదే 'దండుపాళ్యం 4'.
సుమన్ రంగనాథన్, ముమైత్ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్కుమార్, కీలక పాత్రధారులుగా కేటీనాయక్ దర్శకత్వం వహించిన 'దండుపాళ్యం 4' చిత్రం అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియాతో సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ''సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ 'దండుపాళ్యం-4'లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కేటీనాయక్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు'' అన్నారు.
దర్శకుడు కేటీనాయక్ మాట్లాడుతూ.. 'దండుపాళ్యం1,2 పార్ట్స్కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్, ముమైత్ఖాన్, సంజీవ్కుమార్, సుమన్ రంగనాథన్ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్గా నిలుస్తాయి' అన్నారు.
నటీ నటులు :సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్ సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్, డిఎస్ రావు, రాక్ లైన్ సుధాకర్ బులెట్ సోము, విఠల్ రంగయన్, జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్ , స్నేహ , రిచర్డ్ శాస్త్రి తదితరులు.
డైలాగ్స్
:
ఎం.
రాజశేఖర్
రెడ్డి
మ్యూజిక్
:
ఆనంద్
రాజా
విక్రమ
లిరిసిస్ట్
:
భువనచంద్ర
డి
ఓ
పి:
.గిరి
బెనకరాజు
కోరియోగ్రఫీ
:
బాబా
భాస్కర్
ఎడిటర్
:
బాబు
ఏ
శ్రీవాత్సవ
-
ప్రీతి
మోహన్
పోరాటాలు:
కుంగ్
ఫు
చంద్రు
నిర్మాత:
వెంకట్
దర్శకత్వం:
కేటీనాయక్
బ్యానర్
వెంకట్
మూవీస్