Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఇక తప్పు చేయను...క్షమించమన్న హీరో
ఇకమీదట ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను. భార్యను బాగా చూసుకుంటా అని కన్నడ హీరో దర్శన్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. భార్య విజయలక్ష్మిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణపై దాదాపు నెల రోజుల పాటు ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని రాజరాజేశ్వరి నగరలోని ఆయన నివాసం ఎదుట శనివారం పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడారు. ఉదయం వారికి దర్శనమివ్వడంతో పాటు భావోద్వేగంగా ప్రసంగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భార్య వల్లే తాను సంతోషంగా ఉన్నానని, అభిమానుల వల్లే బతుకుతున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా దర్శన్ను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడడంతో ఆయన ఇంటి ప్రహరీ కూలింది.
ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జి చేశారు. అనంతరం దర్శన్ మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా చాముండి కొండకు బయలుదేరారు. ఆయన వెంట తల్లి మీనా, సోదరుడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు మాస్టర్ వినీత్ ఉన్నారు. దర్శన్ పశ్చాత్తాపంతో పాటు విచార వదనంతో కనిపించారు. మైసూరు సమీపంలోని చాముండి కొండ వద్ద అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నటుడిని చూడడానికి యువతీ యువకులు ఎగబడ్డారు. అభిమానులను నియంత్రించడానికి ఆలయం చుట్టుపక్కల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.