Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక తప్పు చేయను...క్షమించమన్న హీరో
ఇకమీదట ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయను. భార్యను బాగా చూసుకుంటా అని కన్నడ హీరో దర్శన్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. భార్య విజయలక్ష్మిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణపై దాదాపు నెల రోజుల పాటు ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని రాజరాజేశ్వరి నగరలోని ఆయన నివాసం ఎదుట శనివారం పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడారు. ఉదయం వారికి దర్శనమివ్వడంతో పాటు భావోద్వేగంగా ప్రసంగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భార్య వల్లే తాను సంతోషంగా ఉన్నానని, అభిమానుల వల్లే బతుకుతున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా దర్శన్ను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడడంతో ఆయన ఇంటి ప్రహరీ కూలింది.
ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జి చేశారు. అనంతరం దర్శన్ మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా చాముండి కొండకు బయలుదేరారు. ఆయన వెంట తల్లి మీనా, సోదరుడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు మాస్టర్ వినీత్ ఉన్నారు. దర్శన్ పశ్చాత్తాపంతో పాటు విచార వదనంతో కనిపించారు. మైసూరు సమీపంలోని చాముండి కొండ వద్ద అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నటుడిని చూడడానికి యువతీ యువకులు ఎగబడ్డారు. అభిమానులను నియంత్రించడానికి ఆలయం చుట్టుపక్కల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.