Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వెంకటేష్ని వద్దనుకుని నాగార్జునే ముద్దనుకుని...
నాగార్జునతో గతంలో సంతోషం వంటి సూపర్ హిట్టిచ్చిన దశరధ్ కి మరోసారి నాగార్జున ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.వెంకటేష్ కు అనుకున్న కథని నాగార్జునకి వినిపించగా ఓకే చేసాడని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. దానికి కారణం సింహా నిర్మాత అని చెప్తున్నారు. సింహా నిర్మాతతో దశరధ్ సినిమాకోస అడ్వాన్స్ తీసుకుని గత కొంత కాలంగా కథని వండుతున్నారు. అయితే దశరధ్ రెడీ చేసిన కథ నచ్చలేదని ,ఇప్పుడు ట్రెండ్ కామిడీ నడుస్తోంది కాబట్టి దూకుడులాంటి కథ చెప్పమనటంతో ఫీల్ గుడ్ స్టోరీ తయారుచేసుకున్న దశరధ్ డైలమోలో పడి నాగార్జునకి కథ చెప్పి ఒప్పించుకున్నాడని చెప్తున్నారు.
కేడీ, రగడ, దడ సినిమాలను నిర్మించిన కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. అయితే నాగార్జున వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.దాంతో డేట్స్ ఇవ్వటానికి మరికొంత సమయం పట్టవచ్చని చెప్తున్నారు. ఇక వరస ప్లాపుల్లో ఉన్న దశరధ్ కి మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం మళ్లీ జీవం పోసి నిలబెట్టింది. ప్రస్తుతం నాగార్జున ...శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న డమురకం చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.