Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
థ్రిల్లర్ చిత్రాల శేఖర్ సూరి నెక్ట్స్..
ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంతో ఒక్క సారిగా పరిశ్రమను తన వైపుకు త్రిప్పుకున్న దర్శకుడు శేఖర్ సూరి. ఆయన తాజాగా దాసరి అరుణ్ కుమార్ హీరోగా ఓ ధ్రిల్లర్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో రూపొందించిన త్రి చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వటంతో ఈ సారి ఎలాగయినా హిట్ కొట్టాలనే ఆకాంక్షతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను షాక్ కు గురిచేసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అందులోను రవిబాబు రాకతో ధ్రిల్లర్స్ కి మంచి టైమ్ వచ్చినట్లే భావిస్తున్నారు. ఇక దాసరి కుమారుడు అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా చిత్రాలు చేసినా ఫలితం లేదు. చివరగా హైదరాబాద్ బాంబ్ ప్రేలుళ్లు నేపద్యంలో రూపొందిన ఆదివిష్ణు కూడా కాపాడలేకపోయింది. దాంతో అరుణ్ కూడా ఈ కొత్త ప్రాజెక్టు పైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచీ ప్రారంభం కానుంది.