Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
థ్రిల్లర్ చిత్రాల శేఖర్ సూరి నెక్ట్స్..
ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంతో ఒక్క సారిగా పరిశ్రమను తన వైపుకు త్రిప్పుకున్న దర్శకుడు శేఖర్ సూరి. ఆయన తాజాగా దాసరి అరుణ్ కుమార్ హీరోగా ఓ ధ్రిల్లర్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో రూపొందించిన త్రి చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వటంతో ఈ సారి ఎలాగయినా హిట్ కొట్టాలనే ఆకాంక్షతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను షాక్ కు గురిచేసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అందులోను రవిబాబు రాకతో ధ్రిల్లర్స్ కి మంచి టైమ్ వచ్చినట్లే భావిస్తున్నారు. ఇక దాసరి కుమారుడు అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా చిత్రాలు చేసినా ఫలితం లేదు. చివరగా హైదరాబాద్ బాంబ్ ప్రేలుళ్లు నేపద్యంలో రూపొందిన ఆదివిష్ణు కూడా కాపాడలేకపోయింది. దాంతో అరుణ్ కూడా ఈ కొత్త ప్రాజెక్టు పైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచీ ప్రారంభం కానుంది.