Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
థ్రిల్లర్ చిత్రాల శేఖర్ సూరి నెక్ట్స్..
ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంతో ఒక్క సారిగా పరిశ్రమను తన వైపుకు త్రిప్పుకున్న దర్శకుడు శేఖర్ సూరి. ఆయన తాజాగా దాసరి అరుణ్ కుమార్ హీరోగా ఓ ధ్రిల్లర్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో రూపొందించిన త్రి చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వటంతో ఈ సారి ఎలాగయినా హిట్ కొట్టాలనే ఆకాంక్షతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను షాక్ కు గురిచేసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. అందులోను రవిబాబు రాకతో ధ్రిల్లర్స్ కి మంచి టైమ్ వచ్చినట్లే భావిస్తున్నారు. ఇక దాసరి కుమారుడు అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా చిత్రాలు చేసినా ఫలితం లేదు. చివరగా హైదరాబాద్ బాంబ్ ప్రేలుళ్లు నేపద్యంలో రూపొందిన ఆదివిష్ణు కూడా కాపాడలేకపోయింది. దాంతో అరుణ్ కూడా ఈ కొత్త ప్రాజెక్టు పైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచీ ప్రారంభం కానుంది.