Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'దాసరీ' నీకిది తగునా!
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆంధ్ర రాష్ట్రనికే కాదు దేశానికే గర్వకారణం. ఎంతో మందిని దర్శకులుగా, నటులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. తాజాగా ఆయన మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అంతా కొత్తవారితో 'యంగ్ ఇండియా' అనే చిత్రాన్ని రూపొందించనున్నారు. దీనికోసం 'ట్యాలెంట్ హంట్' ద్వారా నటీనటులని ఎంపిక చెయ్యనున్నారు.
ఈ సంధర్భంగా దాసరి మాట్లాడుతూ "ఏ దాసరి నారాయణరావు కొడుకో, లేక ఫలానా హీరోగారి కొడుకో, లేక నిర్మాత గారి కొడుకో హీరోలుగా వస్తున్నారు. వారసత్వపు పరిశ్రమగా సినీ పరిశ్రమ తయారయిందని వ్యఖ్యానించారు. వాళ్ల మొహాలు ఎలా వున్నా, వాళ్లలో నటన వున్నా లేకపోయినా ప్రమోట్ చేస్తున్నాం అని పరోక్షంగా ఇప్పటి వారసత్వ కథానాయకుల(రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య, అల్లు అర్జున్...) గురించి విమర్శలు చేసారు. కానీ ఇంతకు ముందు దాసరి గారు ఆయన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ను హీరోగా ప్రమోట్ చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేసిన విషయం మరచినట్టున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆయన పెద్దరికాన్ని ఆయనే తగ్గించుకొంటున్నారన్న కమెంట్స్ ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తోంది.