Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అంతా ఉచితం..సొంత అబ్బ సొమ్మా?
ఇక ఈ పదాలు ఎవర్ని ఉద్దేశించినవో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబం, నందమూరి కుటుంబం, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కుటుంబం, టీఆర్ ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కుటుంబం.. వెరసి ఈ నాలుగు కుటుంబాలు రాష్ట్ర రాజకీయాధికారంపై పట్టు కోసం భీకర పోటీకి సిద్ధమవుతున్నాయి. ఆ మాటలు వీరినుద్దేసించే అంటున్నారు. అలాగే ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా 'ఉచిత కరెంటు'నీ,'ఉచిత' పథకాలనీ ఉద్దేశించే దాసరి ఈ మాటలు అంటున్నారనేది స్పష్టం.
అలాగే ఈ చిత్రంలో మరో పాట 'నాగమల్లీ దారిలో ఈ నాగమల్లీ దారిలో', "జనం కొరకు నేనూ నా కొరకు జనం అని ఒకడు.. జనమే నన్ను పెంచి పోషించారని ఇంకొకడు.. సమాజానికే జీవితం అంకితమంటుంటే.." అని నేటి రాజకీయ నాయకుల్ని ఎద్దేవా చేసి, సగటు పౌరుణ్ణి "క్రికెట్టులోన ఆటగాడు కాబోడుర నీ హీరో.. వెండితెరల వేషగాడు కాకూడదు నీ హీరో..ఫ్యాక్షనిస్టు పాలెగాడు.. కావద్దు నీ హీరో" అంటూ సాగిపోతుంది. రాజకీయ నాయకుల రోడ్డు షోలనూ ఈ పాట వదల్లేదు. "అభిమానం ముదిరిపోయి, ఉన్మాదం పెరిగిపోయి రోడ్డుషోలకు వెళ్లి యాక్సిడెంటు అయిపోతే.. తల్లిదండ్రుల కన్నీళ్లను ఏ హీరో ఆపలేడు" అంటూ సెటైర్స్ విసురుతుంది.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత దాసరి నారాయణరావు తెర ముందుకు వస్తున్న సినిమా మేస్త్రి కావటంతో దానిపై చా లా అంచనాలు ఉన్నాయి . అయితే మేస్త్రి చిత్రం మాత్రం పొలిటికల్ సెటైర్ చిత్రం కాదంటున్నారు దాసరి. ఈ విషయం తేలలంటే ఈ పన్నెండవ తేదీ దాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఆరోజే ఈ చిత్రం రిలీజు.